ఇష్టపడి చదివి మంచి విజయాలు సాధించాలి : కరస్పాండెంట్ జాన్ గొల్లపల్లి
- రాజాపేట మార్చి
విద్యార్థులు ఇష్టంతో చదివి మంచి విజయాలు సాధించాలని సెయింట్ జెకారియా స్కూల్,జాల కరెస్పాండెంట్ బిషప్ జాన్ గొల్లపల్లి అన్నారు.గురువారం స్కూల్ లో ఏర్పాటుచేసిన ఎస్ఎస్సి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు పాఠశాలలో చదువుతోపాటు క్రమశిక్షణ,విలువలు వంటి అనేక అంశాలను నేర్చుకుంటారన్నారు. జీవితంలో విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేయాలన్నారు.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి స్థిరపడాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు కల్చరల్ ఆక్టివిటీస్ తో అలరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కోఆర్డినేటర్ మన్నె వినయ్ కుమార్,టీచర్స్ భగత్ సింగ్, యాకుబ్,నాగేందర్ రెడ్డి,కృష్ణ భాయి, నాగేశ్వర్,రాధిక శ్రీనివాసులు కళ్యాణి ,అశోక్ పల్లవి సౌజన్య రమ్య శిరీష హేమలత తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు అలరించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
